Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: ప్రతి ఒక్కరూ మొక్కల నాటి సంరక్షించాలి: కళ్యాణదుర్గంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ బాల్యం రాజేష్

Kalyandurg, Anantapur | Sep 30, 2025
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కళ్యాణదుర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ పిలుపునిచ్చారు. కళ్యాణ దుర్గం లోని నగరవనంలో మంగళవారం జనసేన పార్టీ నాయకులు, ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ప్లాంటేషన్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు వంద మొక్కలు నాటారు. బాల్యం రాజేష్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం, పచ్చదనం కోసం మొక్కల నాటాలన్నారు. చెట్లు ప్రగతికి చిహ్నాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో కనీసం రెండు మొక్కలైనా నాటాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us