కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధి అయిన గుల్లిపాడు వద్ద రైలు నుంచి జారుపడి అస్సాం వాసి మృత్యువాత పడినట్లు తుని రైల్వే పోలీసులు శనివారం తెలిపారు. మృతుడు ఆధార్ ద్వారా ఏ ప్రాంతం వాడో గుర్తించడం జరిగిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మృతదేహం తరలించినట్లుగా తుని రైల్వే పోలీసులు తెలిపారు