ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం మధ్యాహ్నం ఉధృతికత చోటుచేసుకుంది. గ్రూప్ వన్ మూల్యాంకనంలో అవకతవకల నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా బీఆర్ఎస్వి నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని లైబ్రరీ వద్ద బీఆర్ఎస్వి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉధృతికత చోటుచేసుకుంది. బీఆర్ఎస్వి నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.