అనంతపురంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభకు తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే జేసీఅస్మిత్ రెడ్డి, ఈయన సోదరుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 700 వాహనాల్లో టీడీపీ శ్రేణులు తరలి వెళ్లారు. 450 కార్లు, 250 బస్సుల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం పార్టీ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా తరలి వెళ్లారు.