కూసుమంచి మండలంలోని భగవత్ వీడు గ్రామంలో వరి పొలాలను ఏఓ రామడుగు వాణి పరిశీలించారు. వరిలో కాండం తొలిచే పురుగు ఉధృతిని గమనించి, దాని నివారణకు రైతులకు పలు సూచనలు చేశారు. ఈ పురుగు సోకినప్పుడు పొట్టదశలో ఉన్న పంటలో గింజలు తాలుగా మారతాయని ఆమె తెలిపారు. రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనించి, వ్యవసాయాధికారుల సూచనలతో సస్యరక్షణ చర్యలు పాటించి అధిక లాభాలు పొందాలని ఆమె సూచించారు.