శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన టిడిపి నాయకురాలు పర్వీన్ భాను స్వచ్ఛ ఏపీ కార్పొరేషన్ మిషన్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆదివారం పర్వీన్ భాను నివాసంలో ఆమెకు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందనలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే మహిళలకు గుర్తింపు అని అన్నారు