తిరువూరు నియోజకవర్గ గంపలగూడెం మండలం వినగడప సమీపంలోని కట్టలేరు వాగు కు ఇటీవల వరద ఉధృతంగా ప్రవహించి రోడ్డుపై ప్రవహించి రహదారితోపాటు వంతెన ధ్వంసమైన విషయం తెలిసిందే ఈ రహదారికి కనీసం మరమ్మత్తులు జరిపించని కారణంగా ప్రస్తుతం ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని తల్లిదండ్రుల సాయంతో వెళ్లాల్సి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మత్తులు జరిపించాలని కోరుతున్నారు.