ఆందోల్ నియోజకవర్గం లోని రాయికోడు మండలంలోని కుస్నూర్ గ్రామ శివారులో గల గుర్మిల వాగు బ్రిడ్జి శిథిల వ్యవస్థలో ఉండగా ఇటీవల భారీ వర్షాల కారణంగా పూర్తిగా ధ్వంసం అయింది. ఈ రహదారి ద్వారా బీదర్, నారాయణఖేడ్ కు నిత్యం వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇటీవల వాగులో ఒక వ్యక్తి కొట్టుకోనిపోయి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో కలత చెందిన గ్రామస్తులు సొంత డబ్బులతో స్వయంగా జమ చేసి సిమెంట్,కంకరతో రోలింగ్ చేసి మరమ్మతులు చేశారు. ప్రతి సంవత్సరం అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోలేదని వాపోయారు.