పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండల కేంద్రంలోని తాహసిల్దార్ ఎదుట శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఏసు బాబుకి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.