అనంతపురం నగర శివారులోని చెక్ డ్యామ్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం లో ఇమాములు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.