ఐరాల మండలం, నాంపల్లి గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాంపల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేను స్థానిక నాయకులు పూలమాలతో, దుశ్శాలతో ఘనంగా సత్కరించగా, మహిళలు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. అనంతరం ఐరాల-పాటూరు రోడ్డునుంచి నాంపల్లి వరకు నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు.