యూరియా సరఫరాలో కూటమి ప్రభుత్వం వైఫల్యం: సింహాద్రి రమేష్ బాబు రైతాంగానికి యూరియాను సమృద్ధిగా సరఫరా చేసి ఆదుకోవాలని వైసీపీ రైతు విభాగం జోనల్ అధ్యక్షుడు సింహాద్రి రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్తానిక మచిలీపట్నంలో జరిగిన అన్నదాత పోరు నిరసనలో మంగళవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన మిడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం యూరియాకు కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. రైతుల కోసం నిరసనలకు పిలుపునిస్తే పోలీసులు ఆంక్షలు పెట్టడం దుర్మార్గమని విమర్శించారు.