తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్ఎస్ పార్టీ కొందరు MLAలు పార్టీ మారినట్లు బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఐదుగురికి నోటీసులు జారీ చేశారు. ఈ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని MLAలను ఆయన ఆదేశించారు. దీనిపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పందిస్తూ..నేను పార్టీ మారలేదు కాంగ్రెస్లోకి వెళ్లలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను.