అనంతపురం నగర శివారులోని కొరుగుంటలో ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నేతృత్వంలో ఇద్దరు దివ్యాంగులకు ఆదర్శ వివాహాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్రకోడుకు చెందిన అల్లావుద్దీన్, నార్పల మండలం వెంకటం పల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ అనే ఇద్దరు దివ్యాంగులు వివాహం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు. నవ దంపతులను వారు ప్రత్యేకంగా ఆశీర్వదించారు.