మల్బరీ సాగు లాభదాయకంగా ఉంటుందని అనంతపురం జిల్లా పట్టు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మురళి అన్నారు. కుందుర్పి మండలం నిజ్జవల్లి గ్రామంలో శనివారం సెరికల్చర్ రైతులకు మల్బరీ సాగు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మల్బరీ దిగుబడి బాగా రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో సెరికల్చర్ అధికారిని కుసుమకుమారి పాల్గొన్నారు.