వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండండి.జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి.ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఇల్లందు మండల న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కన్న తల్లిదండ్రులను పిల్లలు భారంగా భావిస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులకు ఆస్తులు పంచుకుంటున్నారు గానీ, వారి యొక్క పోషణను, సంరక్షణను దృష్టిలో పెట్టుకోవడం లేదని, అన్నారు