Download Now Banner

This browser does not support the video element.

చేగుంట: మండల వ్యాప్తంగా దాదాపు 280 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది : ఇంచార్జ్ మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్

Chegunta, Medak | Aug 30, 2025
నార్సింగి మండల వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు కుంటలు నిండడంతో పంటలు కూడా నీట మునిగిపోయాయి. మునిగిపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటితో నిండిపోయిన పంట పొలాలను పరిశీలించిగా ఇప్పటి వరకు మండల పరిధిలో ప్రాథమికంగా వరి 253 మంది రైతులకు సంబంధించి 280 ఎకరాలలో దెబ్బతినట్లు ప్రాథమికంగా అంచనా వెయ్యటం జరిగిందన్నారు. పంటలకు సంబంధించి నివేదికలు తయారు చేసినట్లు తెలిపారు. నివేదికను ఉన్నత అధికారులకు పంపిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ లు దివ్య,విజృంభణ రైతులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us