అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని ఉరవకొండ మండలం ఛాయాపురం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో గాజుల మల్లాపురం గ్రామానికి చెందిన వన్నూరు స్వామి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని తొలుత ఉరవకొండ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవల కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.