ఏలూరు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్నెంట్ జి.పాండురంగారావు ఆధ్వర్యంలో చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో సారా కేంద్రాలపై గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నాగిరెడ్డిగూడెంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనర్హం అని తెలిపారు. నియోజకవర్గాన్ని సారా రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యం అని తెలిపారు.