కూకట్పల్లిలోని మాధవి నగర్ లో రోడ్డుపైన నీరు పొంగిపొర్లడంతో కాలనీవాసులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ఎవరు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రోడ్డుపై ప్రవహిస్తున్న నీటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరారు.