రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.