గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో ఆదివారం వినాయక నిమజ్జన వేడుకలు సిరిసిల్ల మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద, ప్రేమ్ నగర్ లో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ బోటులో మానేరు నదిలో నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.