Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 21, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలంలోని అనేక గ్రామాలకు చెందిన దివ్యాంగులు పెన్షన్ తొలగింపు నోటీసులు అందుకోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ మండల యువజన అధ్యక్షుడు చండ్ర నారాయణ స్వామి ఆధ్వర్యంలో మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.