జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.14 లక్షలతో నిర్మించనున్న సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 19 లక్షలతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...చల్గల్ లో 200 కోట్ల రూ. వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయటం జరిగిందని వివరించారు.చల్గల్ లో 10 ఎకరాలలో ఇండోర్ స్టేడియం మంజూరుకు తన వంతుగా కృషి చేస్తానని... ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు.