తిరుపతి జిల్లా గూడూరు పాత బస్టాండ్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అతని మెడలో వెంకయ్య స్వామి రాగి డాలర్ వేసుకుని ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు గూడూరు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించి మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తెలియజేశారు