Bhupalpalle, Jaya Shankar Bhalupally | Jun 12, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఎంఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపల్లి పాపయ్య.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఈనెల 14న జరిగే ప్రముఖ ఐఏఎస్ మధ్యప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ పిరికిపండ్లు నరహరి మరియు హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ రచించిన 'ద ఓబీసీస్ అప్ రైజింగ్' పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.ఈ దేశంలో వెనుకబడిన బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని మరియు వాటి పరిష్కారానికి పుస్తకంలో విపులంగా పొందుపరచడం జరిగిందని పాపయ్య తెలిపారు.