Download Now Banner

This browser does not support the video element.

గిద్దలూరు: గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు సగిలేరు వాగు కు వచ్చి చేరుతున్న నీరు, ప్రజలు ఆనందం

Giddalur, Prakasam | Sep 3, 2025
భారీ వర్షాలతో అతలాకుతలం అవుతూ ప్రజలు ఆందోళన చెందుతుంటే.. ప్రకాశం జిల్లా లోని ఆ ప్రాంతంలో మాత్రం బుధవారం వరద నీరు చూసిన ప్రజలు గంతులు వేస్తూ పూజలు నిర్వహించారు. ఇటువంటి అరుదైన సంఘటన గిద్దలూరు సమీపంలోని కొండపేట వద్ద చోటుచేసుకుంది. కొద్దిరోజులుగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో సగిలేరు వాగుకు వరద నీరు వచ్చి చేరుతుంది. నాలుగు సంవత్సరాల తర్వాత సగిలేరు వాగులో వరదనీరు వస్తుండడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యువకులు సగిలేరు వాగులో ఈత కొడితే మహిళలు వాగుకు దండం పెడుతూ నమస్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us