ములుగు జిల్లా ములుగు మండలం బండారుపల్లిలో బంజారాల పండగ అయినటువంటి తీజ్ ఉత్సవాలలో భాగంగా నిన్న రాత్రి బుధవారం 8 వ రోజు సందర్భంగా "గణగోర్" అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బంక మట్టితో బొమ్మను చేసి దానితో ఆటలు ఆడి, గిరిజన నృత్యాలు చేసి, అనంతరం ఆ బొమ్మను కూల్చివేస్తారు. దీంతో ఇక నేడు గురువారం రోజున తీజ్ పండగ చివరి ఘట్టానికి చేరుకుంటుంది.