Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 8, 2025
ఉదయగిరి మండలానికి చెందిన రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం యూరియా పంపిణీకి శ్రీకారం చుట్టారు. విషయం తెలుసుకున్న రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డుతో అధిక సంఖ్యలో రావడంతో రైతులు బారులు తీరారు. ఏవో విజయభాస్కర్ మాట్లాడుతూ.. మండలానికి 18 టన్నులు (400) బస్తాలు యూరియా వచ్చినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.