పామిడి మండల కేంద్రంలోని గుత్తి రోడ్డు లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మట్కా స్థావరంపై శనివారం రాత్రి సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ మట్కా రాస్తున్న ఎనిమిది మంది బీటర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,13,900 నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మట్కా చీటీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సీఐ యుగంధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.