కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు మండలం చెన్నూరులో ఆదివారం వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూరు మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ బాబు మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరిగే 'అన్నదాత కోసం పోరుబాట' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పోరుబాటలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.