ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో గణేశుడి శోభాయాత్ర శుక్రవారం మధ్యాహ్నం వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో గణనాథులను తరలిస్తున్నారు. 9 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించిన గణనాథుడిని ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళుతున్నారు. ఇందులో భాగంగా మహిళలు, చిన్నారుల ఆటపాటలు ఎంతగానో అలరిస్తున్నాయి.