రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని తహశీల్దార్ టి. సత్యనారాయణ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వం ఆలోచిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు నరసన్నపేట తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నాయని వివరించారు. వీటిని రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్తో పాటు కుటుంబ వివరాలన్నీ కూడా పొందుపరిచి ఉన్నాయని అన్నారు.