నాలుగో తేదీ వచ్చినా కానీ గోకవరం మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో రేషన్ పంపిణీ కాలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రేషన్ కోసం డీలర్ల వద్దకు వెళితే, పి ఓ ఎస్ మిషన్లు పని చేయడం లేదని జాప్యం చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి రేషన్ సరఫరా త్వరగా చేయాలని కోరుతున్నారు.