సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని రాష్ట్ర హోం మంత్రి అనిత అన్నారు. ఈ సందర్భంగా పలనాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన స్త్రీ శక్తి విజయోత్సవ సభలో ఆమె మాట్లాడారు. గంజాయితో యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని దానిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని తెలిపారు.