వాసవి మా ఇల్లు సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏడాది 5 వేల విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమని చెప్పారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, సంస్థ వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్ పాల్గొన్నారు.