బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (హెల్త్ సబ్ సెంటర్)కార్యక్రమంలో భాగంగా 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పల్లె దావకానాను ప్రారంభించి, రామాలయం కళ్యాణ మండపంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీతా కార్మికులకు 72 మందికి 100 శాతం సబ్సిడీ తో కాటమయ్య కిట్లను గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలలో జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం బీర్ పూర్ మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 5 లక్షల 80 వేల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్