ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ అనే రైతును ఓ ఫెర్టిలైజర్ దుకాణం యజమాని నట్టేట ముంచారు. ఆరుగాలం కష్టపడి పంట పండిద్దామని అధిక వడ్డీలకు అప్పులు చేసి పత్తి పంట సాగు చేస్తున్న రైతుకు హాసన్ ఫర్టిలైజర్స్,ఫెస్టిసైడ్ యజమాని పత్తి ఎదుగుదలకు తోడ్పడుతుందని షూటర్ అనే మందును రైతుకు అమ్మాడు. ఆ మందును రైతు పిచికారి చేశాడు. పిచికారి చేసిన నాలుగు రోజుల్లోనే పత్తి పంట మొత్తం కమిలిపోయింది . సుమారు 9ఎకరాల విస్తీర్ణంలో పత్తి చేను నష్టానికి గురైందని బాధిత రైతు బుధవారం వాపోయారు.