స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గజపతినగరం మండలంలోని గంగ చోళ్ళ పెంట, కొనిస తదితర గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం ఇన్చార్జ్ ఎంపీడీవో పుష్పలత పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సుగుణాకర రావు తదితరులు పాల్గొన్నారు.