జడ్చర్ల పట్టణ కేంద్రంలో సిగ్నల్ గడ్డ ప్రాంతంలో పాఠశాలకు వెళ్తున్న చిన్నారులను ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. దీంతో చిన్నారులకు స్వల్ప గాయాలు కావడంతో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చిన్నారులను గమనించి వెంటనే ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి మానవత్వాన్ని చాటుకున్నాడు. దీంతో ప్రమాదానికి కారణమైన యువకుడుని రోడ్లపై జాగ్రత్తగా వాహనాన్ని నడపాలని ఎమ్మెల్యే మందలించాడు.