Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా 75వ ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు: జేసీ ఫర్మాన్ అహ్మద్

Srikakulam, Srikakulam | Aug 7, 2025
శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఆగస్టు 13 నుండి 15 వరకు జరిగే వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ఈ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, మూడు రోజుల పాటు జరిగే వేడుకలు జిల్లాలోని సాంస్కృతిక, చారిత్రక, ఆదివాసీ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us