ఆదోని పట్టణంలో తొలగించిన వికలాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలని, బుధవారం ఆదోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శెట్టి ప్రకాష్ తెలిపారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలని వారు అన్నారు. వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తమ దృష్టికి తీసుకొచ్చారని, వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.