తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించే వాలంటీర్ విధులను బహిష్కరిస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తెలిపారు. శనివారం మామిడికుదురు ఎంపీడీవో భవానికి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఎన్నిసార్లు అధికారులకు సమస్యలను విన్నవించినా ఫలితం లేదని, ప్రభుత్వం తమ ఆత్మగౌరవాన్ని దిగజార్చే నిర్ణయాలు తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు.