బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజనగరంలో ఉన్న విశ్వక్సేన్ గోషాలలో ఉన్న ప్రత్యక్ష వినాయకుడికి ఘోషాల నిర్వహకులు ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆచార్యులు మాట్లాడుతూ గోమాతతో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని గణపతి గోమాత కంటి క్రింద చెవికిరింద ఉంటారని వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో గోవులకు నైవేద్యాన్ని సమర్పించి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.