శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లిలో వినాయక చవితిని పురస్కరించుకుని ఎద్దుల బండ్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పరుగు పందెం పోటీల్లో పాల్గొనేందుకు మండల నలుమూలల నుంచి రైతులు ఎద్దులను తీసుకురావడంతో కోలాహలం నెలకొంది. పోటా పోటీగా సాగిన ఈ పోటీలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎద్దుల బండ్ల పరుగు పందెం పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి మొదటి బహుమతిగా 50000 రెండో బహుమతిగా 30,000 మూడవ బహుమతిగా 20000 రూపాయలను గ్రామస్తులు అందజేశారు.