శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం మైలసముద్రం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కూలీలతో వెళుతున్న ఆటోను 407 టెంపో ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న 6 మంది కూలీలకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిక తరలించారు. గాయపడ్డ వారిలో మీనమ్మ, వెంకటలక్ష్మమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.