శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని వానవోలు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కోసం మండల టీడీపీ కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యా ధరణి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం జల జీవన్ మిషన్ పథకం కింద ఓవర్ హెడ్ ట్యాంక్ వానవోలుకు మంజూరు అయింది. భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.