ఆటో కార్మికుల జీవన విధానాన్ని కూటమి ప్రభుత్వము అడ్డుకుంటూ వారి పొట్ట కొట్టుతోందని ఏఐటియుసి నాయకులు మండిపడ్డారు చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నిరసనకు దిగారు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 11252 మంది ఆటో కార్మికులు ఉన్నారని చెప్పారు ఉచిత బస్సు పేరుతో ఆటో కార్మికులకు ఈ ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేసిందన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నారావారిపల్లెను ముట్టడిస్తామని హెచ్చరించారు.