ఆనందపురం మండలం పందలపాకలోని ఐటీబీపీ 56వ బెటాలియన్ హెడ్క్వార్టర్స్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన కానిస్టేబుల్ (జిడి) జగదల నరేంద్రనాథ్ శుక్రవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 15 నెలలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నరేంద్రనాథ్, విధులు ముగిసిన తర్వాత బెటాలియన్ హెడ్క్వార్టర్స్లోని మామిడి చెట్టుకు నైలాన్ వైరుతో ఉరి వేసుకొని చనిపోయాడు.