చెరువుల సుందరీకరణలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూకట్పల్లిలోని నల్ల చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. తమపై వచ్చిన విమర్శనాలను తట్టుకొని చెరువును సుందరీకరించినట్లు తెలిపారు. ఈ పనుల వల్ల చెరువు విస్తీర్ణం 10 ఎకరాలు పెరిగిందని, నీటి నిలువ సామర్థ్యం పెరిగి వరదల ముప్పు తగ్గిందని చెప్పారు. డ్రైనేజీలు కలవకుండా చర్యలు తీసుకున్నామన్నారు.